‘క్రాక్’ ఓటీటీ రిలీజ్

రోనా కారణంగా థియేటర్స్ మూతపడ్డాయ్. ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే పరిస్థితుల్లేవ్. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’ ఓటీటీలో రిలీజ్ కాబోతుందని సమాచారమ్. ‘బలుపు’ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ్-శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు.

వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో కుటుంబ విలువలకు ప్రాధాన్యముంటుంది. అన్యాయాల్ని ఎదురించే నిజాయితీపరుడైన పోలీస్‌ అధికారిగా రవితేజ కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.  సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు.

‘క్రాక్’ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. పిరీడ్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో  హీరోయిన్ ఎవరు ? మిగితా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.