కేటీఆర్ కౌంటర్ అదిరింది

తెలంగాణలో కరోనాని కంట్రోల్ చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, ఆయన ఫాంహౌస్ కి పారిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయ్. తెలంగాణ భాజాపా అయితే ఇటీవల కాలంలో దూకుడు పెంచింది. కరోనా, సచివాలయం కూల్చివేత విషయంలో తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భాజాపాకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు. దేశం మొత్తం కరోనా విజృంభిస్తోంది. కరోనా విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఈ విషయంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని అనుకోవాలా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం సరికాదని ఆయన సూచించారు.