గ్రేట్ : 400 కుటుంబాలకు సోనూసూద్ సాయం

బాలీవుడ్ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన పేదలకి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కరోనా విరాళం అందించారు. కరోనా లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చారు. వలస కార్మికులని సొంత డబ్బులు ఖర్చుపెట్టి స్వస్థలాలకి చేర్చారు.

తాజాగా కరోనా లాక్ డౌన్ సమ‌యంలో వివిధ ప్ర‌మాదాల‌లో మ‌ర‌ణించిన లేదా గాయ‌ప‌డ్డ వ‌ల‌న కార్మికుల కుటుంబాల‌కి సాయం చేయాల‌ని సోనూసూద్ నిర్ణయించుకున్నారు. ఇప్ప‌టికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వివరాలు సేకరించారు. చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సోనూసూద్ సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించబోతున్నట్టు సమాచారమ్.