ఏపీలో ఒక్కరోజే 43 మంది మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 43 మంది మృతి చెందారు. 1916 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,019కి చేరింది. మృతుల సంఖ్య 408కి చేరింది.

కొత్త మృతి చెందిన వారిలో అనంతపూర్‌లో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 15,144 మంది చికిత్స పొందుతున్నారు. మరో 17,467 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.