రకుల్.. ఓ వేశ్య !


స్టార్ హీరోయిన్ రకుల్ సింగ్ ని వేశ్య అంటున్నారు. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ ప్లాన్ చేస్తుంటారు. ఇందులో వేశ్య పాత్ర కోసం రకుల్ ని తీసుకున్నారని తెలిసిందే. ఛాలెజింగ్ పాత్ర కావడంతో రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్.

ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రలో కనిపించి మెప్పించారు. మాధురి ధీక్షిత్, టబు, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్, కరీనా కపూర్ వేశ్యపాత్రల్లో నటించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా వేశ్యగా మారిన సంగతి తెలిసిందే. వేదం సినిమా కోసం అనుష్క వేశ్యగా మారింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా వేశ్యగా మారనుంది. మరీ.. ఆ పాత్రలో ఏ మేరకు హీటెక్కిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం రకుల్ ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తోంది.