దేశంలో రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 29,429 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 582 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు.

దేశంలో కరోనా వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 9,36,181కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  మరణాల సంఖ్య 24,309కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 5,92,032 మంది కోలుకోగా మరో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.92శాతం, మరణాల రేటు 2.61శాతంగా ఉన్నాయి.