మణిరత్నం ఓటీటీ ప్రయోగం

గ్రేట్ దర్శకుడు మణిరత్నం కూడా ఓటీటీకి టర్న్ అవుతున్నారు. వైవిధ్యం, భారీతనం రెండూ ఉండేలా ఓ వెబ్‌సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నారట. మణిరత్నం వెబ్‌సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయి. తొమ్మిందిటికీ తొమ్మిది మంది హీరోలు, దర్శకుల ఉంటారట. ఆ తొమ్మిదిలో ఓ ఎపిసోడ్‌కు మణిరత్నం దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కోసం మణిరత్నం తన స్కూల్ లోని హీరోలని ఎంచుకున్నట్టు తెలిసింది. మాధవన్‌, సూర్య, సిద్ధార్థ్.. తదితరులని తీసుకున్నారట. సంగీత దర్శకులు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. అన్నట్లు ఈ సిరీస్‌కు ‘నవరస’ అని పేరు పెడుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో ఎపిసోడ్‌ ఒక్క రసం చూపించేలా మణిరత్నం వెబ్ సిరీస్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.