కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జూనియర్, డిగ్రీ కళాశాల్లోనూ మధాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మధాహ్న భోజన పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఇప్పుడు జూనియర్, డిగ్రీ కళాశాలకి కూడా వర్థింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక కరోనా ప్రభావంతో ఈ యేడాది విద్యాసంస్థలు తెరచుకొనే పరిస్థితుల్లేవ్. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ తరగతులకి అనుమతులు ఇవ్వాలా ? అన్నది సమాలోచనలు చేస్తున్నారు. ఒకవేళ చేస్తే టీ-శాట్, నిపుణ ఛానెల్స్ ద్వారా అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.