దేశంలో 34,884 కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,884 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 10,38,716కు చేరింది. వీరిలో 3,58,692 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 6,53,750 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 

కొత్తగా మరో 671 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 26,273కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,61,024 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,34,33,742 నమూనాల్ని పరీక్షించారు.