ఎల్లుండే ఏపీ కేబినేట్ విస్తరణ

ఏపీ క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండే (జులై 22) సీఎం జగన్ తన కేబినేట్ ని విస్తరించబోతున్నట్టు సమాచారమ్. జగన్ కేబినేట్ లో రెండు స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబాబు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు వారి స్థానాలని సీఎం జగన్ భర్తీ చేయనున్నారు.

ఈ రెండు స్థానాల కోసం శ్రీకాకుళం జిల్లాకు, మరొకటి రామచంద్రపురం ఎమ్మెల్యేకు దక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం జగన్ ఖాళీ అయిన రెండు స్థానాలని మాత్రమే భర్తీ చేస్తారా ? లేక మరికొందరికి అవకాశం కల్పిస్తారా ?? అన్నది తెలియాల్సి ఉంది. అదే జరిగితే.. కొందరి శాఖలు మారవచ్చని చెబుతున్నారు.