మరో మంత్రికి కరోనా

ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కూడా కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి అస్లామ్ షేక్‌కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే తాను అసింప్టమాటిక్‌ అని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. తాను ఇకపై ఇంటి నుంచే మహారాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని అస్లామ్ తెలిపారు. అలాగే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్య మాత్రం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.