త్వరలో శింబు-త్రిషల పెళ్లి.. ఫర్ ఫెక్ట్ జోడి !

కోలీవుడ్ లో షాకింగ్ ప్రచారం ఒకటి జరుగుతోంది. అదేటంటే ? త్వరలో త్రిష శింబుని పెళ్లాడబోతుందట. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది తెలియదు. కానీ వీరిది ఫర్ ఫెక్ట్  జోడి అని ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు. ఎందుకంటే.. ? శింబు, త్రిష ఇద్దరూ లవ్ ఎఫైర్స్ తో దిట్టలు. పలుమార్పు లవ్ ఎఫైర్స్, బ్రేకప్ లతో వార్తల్లో నిలిచారు.

శింబు-నయనతారల ప్రేమాయణం గురించి తెలిసిందే. వీరి ప్రేమ గురించి ఇప్పటికీ కోలీవుడ్ లో కథలు కథలు చెప్పుకొంటున్నారు. ఆ తర్వాత హన్సికతోనూ శింబు కథనడిపారు. పైకి తెలిసిన కొన్ని మాత్రమే. కానీ శింబు లిస్టులో చాలా ఫెల్యూర్ ప్రేమకథలు ఉన్నాయని కోలీవుడ్ టాక్. ఇక త్రిష తక్కువేం కాదు. ఆమె రానా దగ్గుపాటితో ప్రేమలో పడింది. ఈ జంట కొన్నాళ్లు సరదాగా గడిపిందనే ప్రచారం జరిగింది నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం జరిగి క్యాన్సిల్ అయ్యింది. ఇదీగాక, పలువురితో లింకుపెట్టి త్రిష పేరు ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే శింభు-త్రిష జోడి ఫర్ ఫెక్ట్ అని చెప్పుకొంటున్నారు కోలీవుడ్ జనాలు అయితే శింబు ఏ అమ్మాయితో కలకాలం జీవించాలనే మైండ్ సెట్ ఉండదు. అలాంటి శింబుతో త్రిష పెళ్లి జరిగితే.. వీరిద్దరు కలకాలం కలిసి జీవించగలరా  ? అన్నది చర్చనీయాంశంగా మారింది. త్రిష-శింబు కలిసి  విన్నైతాండి వరువాయ(ఏమాయ చేశామే తమిళ్‌ వెర్షన్‌), అలై అనే చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు మంచి విజయాన్ని సాధించాయి.  త్వరలోనే  విన్నైతాండి సీక్వెల్ కూడా రాబోతుంది.