దేశంలో 37,148 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 40వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 37,148 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,55,191కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 28,084 మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 7,24,578 మంది కోలుకోగా మరో 4,02,529 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5శాతంగా ఉంది. దేశంలో‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 600మంది మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ మృతుల సంఖ్య 28,084గా ఉంది.