గుడ్ న్యూస్ : ఐపీఎల్ కు లైన్ క్లియర్

అనుకున్నట్టే టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. సోమవారం జరిగిన ఐసీబీ బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐపీఎల్ కు లైన్ క్లియర్ అయినట్టు అయింది. అయితే ఐపీఎల్ 13 ఎప్పుడు నిర్వహిస్తారు ? ఎక్కడ నిర్వహించబోతున్నారు ? అన్నది ఒక్కటే తేలాల్సి ఉంది. ముంబయిలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నా పరిస్థితులు మెరగవ్వకపోతే దుబాయ్‌కి తరలిస్తారని తెలుస్తోంది.

యూఏఈలో టోర్నీ జరగడం ఖాయమని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. తమ జట్టు సభ్యులకు అక్కడే శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. టీమ్‌ఇండియా శిక్షణ శిబిరం సైతం అక్కడే ఉంటుందని సమాచారం. ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు ఛార్టెడ్‌ విమానాలను ఉపయోగిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో ఐపీఎల్‌పై స్పష్టత రానుంది. వీలైనంత వరకు భారత్ లో నిర్వహించేందుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.