విజయసాయిరెడ్డికి కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయన కరోనా పాజిటివ్ గా తేలిందని స్పష్టంగా తెలియలేదు.
 
కానీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ వారం పది రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలనుకుంటున్న విజయసాయి ట్విట్ చేశారు. అంతేకాదు.. ఈ పది రోజులు ఎవ్వరికీ అందుబాటులో ఉండను. ఫోన్ లో కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అత్యవరం అయితే తప్ప తనకి ఫోన్ చేయకూడదని ట్విట్ చేశారు విజయసాయి.