బ్యాంక్ ఉద్యోగులకి గుడ్ న్యూస్

ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్ ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఇకపై ప్రతియేడాది బ్యాంకు ఉద్యోగుల్లో వేతనాల్లో 15శాతం పెంపు ఉండనుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ),యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) నిర్ణయం తీసుకున్నాయి.

ముంబైలో జరిగిన ఐబిఎ మరియు యుఎఫ్‌బియుల మధ్య జరిగిన సమావేశంలో విస్తృత అవగాహన కుదిరిందని, అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటచలం మీడియాకు వివరించారు. తాజా నిర్ణయంతో 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకి ప్రయోజనం కలగనుంది.