నల్గొండ క్రాస్‌రోడ్‌ టు ఓవైసీ కూడలి కారిడార్‌ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద నల్గొండ క్రాస్‌రోడ్‌ నుంచి సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా ఓవైసీ కూడలి వరకు రూ.523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కారిడార్‌ నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు గురువారం శంకుస్థాపన చేశారు. 

24 నెలల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టులో కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు ఉండగా, అందులో 2.580 కిలోమీటర్ల పొడవు పైవంతెన, మిగతాది ఇరువైపులా ర్యాంపులని ఏర్పాటు చేయనున్నారు. ఈఫ్లైఓవర్‌ నిర్మాణంతో నల్గొండ క్రాస్‌ రోడ్ నుంచి ఒవైసీ ఆసుపత్రి జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.