మణిరత్నం మల్టీస్టారర్ నుంచి ఐష్ ని తీసేశారా ?

బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా సోకింది. ప్రస్తుతం వీరింతా చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా సోకిన కారణంగా ఐశ్వర్యారాయ్ ని మణిరత్నం మల్టీస్టారర్  ‘పొన్నియన్‌ సెల్వన్’ నుంచి తీసేశారు అనే ప్రచారం జరుగుతోంది.

ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. చోళుల కాలం నాటి కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో‌ విక్రమ్‌, కార్తీ, జయంరవి, పార్తిబన్‌, జయరాం, ఐశ్వర్యరాయ్‌, అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ శుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గగానే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఐష్ ని ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తీసేశారనే వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతోంది.