మాజీ ఎంపీ కవితకు కరోనా ?

సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత హోం క్వాంరంటైన్ లోకి వెళ్లిపోయినట్టు సమాచారమ్. ఆమె డ్రైవర్ కు, గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కవిత ఫ్యామిలీ హోంక్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 50వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది. మరణాల సంఖ్య 447కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 662 వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33,327 మంది (77.3 శాతం) మంది కోలుకోగా.. ప్రస్తుతం 11,052 యాక్టివ్‌ కేసులు ఉన్నన్నాయి.