ఈషా రెబ్బా స్టార్ హీరోయిన్ అయిపోయిందబ్బా.. !!

కరోనా కారణంగా ప్రేక్షకులకి ఎంటర్ టైన్ మెంట్ తక్కువైంది. ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లు , కొన్ని సినిమాలు మాత్రమే చూడాల్సి వస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా హీరో-హీరోయిన్స్ ప్రేక్షకులకి ఎంటర్ టైన్ మెంట్ పంచే ప్రయత్నం చేస్తున్నారు.
 
కరోనా టైమ్ లో సినీ తారలు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు చేసుకొంటున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అవి వారి అభిమానులని అలరిస్తున్నాయి. మురిపిస్తున్నాయ్. అయితే కరోనా టైమ్ లో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడంలో యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ముందుంది.

ఆమె నుంచి వరుసగా ఫోటో షూట్స్ ఫోటోలు క్యూ కడుతున్నాయి. అవి అదిరిపోయేలా ఉంటున్నాయి. ప్రేక్షకులని అలరిస్తున్నాయ్. అందుకే కరోనా టైమ్ లో ఈషా రెబ్బా స్టార్ హీరోయిన్ అనిపోయింది అని చెప్పుకొంటున్నారు. అదీ నిజమే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఈషా ఓ వీడియో చేసిన సంగతి తెలిసిందే. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈషా నిజంగానే హీరోయిన్ అయిపోయినట్టే మరీ.. !