పోలీసుల నుంచి తప్పించుకున్న కంగనా ?

బాలీవుడ్  హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు సుదీర్ఘ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుశాంత్ ఫ్యామిలీ, బంధువులు, స్నేతులని విచారించారు. పలువురు సినీ ప్రముఖులని విచారిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ కంగనాను కూడా ప్రశ్నించాలని నిర్ణయించారు ముంబయి పోలీసులు. ఈ మేరకు ముంబయిలోని ఆమె నివాసానికి నోటీసులు పంపించారు.

అయితే అక్కడ కంగనా లేదు. దీంతో కంగనా పోలీసుల విచారణ నుంచి తప్పించుకుందంటూ బాలీవుడ్ లో ఓ ప్రచారం మొదలైంది. దీనిపై కంగనా లాయర్ స్పందించాడు. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి కంగన ముంబయిలో లేదని, తన కుటుంబ సభ్యులతో కలిసి మనాలీలో ఉందని తెలిపాడు. అంతేకాదు.. ఇప్పట్లో కంగనాకు ముంబై వచ్చే ఉద్దేశం లేదని తెలిపారు. కావాలంటే.. ? లైవ్ ఛాటింగ్, వెబ్ మీడియా ద్వారానైనా కంగనాను పోలీసులు ప్రశ్నించొచ్చని కోరాడు. దీనిపై ముంబై పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో బంధు ప్రీతినే కారణమని కంగానా ఆరోపిస్తోంది. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాలే సుశాంత్ కెరీర్ ను పనిగట్టుకొని నాశనం చేశారని ఆరోపించింది. ఇప్పుడీమె ఆరోపణలు, వాదనలన్నీ పోలీస్ రికార్డుల్లోకి కూడా ఎక్కబోతున్నాయి. అయితే కంగనా ఎప్పుడు పోలీసులకి అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.