24 గంటల్లో 48,916 కొత్త కేసులు.. 757 మరణాలు !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 757 మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861కి చేరింది. మరణాల సంఖ్య 31,358కి పెరిగింది.

ఇప్పటి వరకు 8,49,432 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,56,071 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు క్రమంగా తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం కరోనా మరణాల రేటు 2.38గా ఉంది.