గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న బన్నీ ఫ్యామిలీ


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. బన్నీ భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హా, అయాన్ లతో కలిసి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల స్నేహారెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసిరారు. ఇక ఈ ఛాలెంజ్ ని పూర్తి చేయడం పట్ల స్నేహారెడ్డి సంతోషం వ్యక్తం చేసింది. తెరాస ఎంపీ సంతోష్ కుమార్ కు థ్యాంక్స్ చెప్పింది. బన్నీ ఫ్యామిలీ మొక్కలు నాటుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ యేడాది ‘అల.. వైకుంఠపురం’ సినిమాతో అల్లు అర్జున్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా హిట్ జోష్ లో ఉండగానే కరోనా విజృంభణ మొదలైంది. ఇప్పటికే ఓకే అయిన బన్నీ సినిమా పుష్ప సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇదీగాక బన్నీ ‘ఐకాన్’ సినిమాని చేయాల్సి ఉంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలోనూ బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.