కరోనా తర్వాత తొలిసారి.. గ్యాలరీలో అభిమానులు !

కరోనాకి ముందు కరోనా తర్వాత జీవితం ఒకేలా ఉండకపోవచ్చు అనుకున్నాం. అయితే కరోనా ప్రభావం తగ్గితే మునుపతి జీవితాన్ని చూడొచ్చని తెలుస్తోంది. ఇకపై క్రికెట్ స్టేడియాల్లో జనాలు కనిపించరని అనుకొన్నారు. కానీ కరోనా తర్వాత తొలిసారి స్టేడియంలోకి జనాలు వచ్చారు. ఎప్పటిలాగే మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు.

సర్రే మరియు మిడిల్‌సెక్స్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్‌లో మొదటిసారి ప్రేక్షకులను అనుమతించారు. కరోనా సామజిక నియమాలను పాటిస్తూ కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించింది. అయితే టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన గంటలోపు బుకింగ్ కోసం వారికి 10,000 కాల్స్ వచ్చాయని సర్రే చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ తెలిపారు.