సుశాంత్ కేసు : మహేష్ ని విచారించిన పోలీసులు


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముంబై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులని పోలీసులు విచారించారు. తాజాగా ప్రముఖ నిర్మాత మహేష్‌ భట్‌ విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని శాంటాక్రుజ్‌ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ అభిషేక్‌ త్రిముఖే ఎదుట ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. 

మహేష్‌ భట్‌తోపాటు కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం కోరారు. నటి కంగనా రనౌత్‌ను కూడా వాంగ్మూలం రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. కాగా, సుశాంత్‌సింగ్‌ జూన్‌ 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.