కరోనాతో మొద్దుశీను హత్య కేసు నిందితుడు మృతి

మొద్దుశీను హత్య కేసులోలో జీవిత ఖైదుగా ఉన్న నిందితుడు ఓం ప్రకాశ్‌ మృతి చెందాడు. ఆయన కరోనాతో మృతి చెందారా ? అంటే.. అవుననే అంటున్నారు. ఓం ప్రకాశ్‌ శనివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని.. దీంతో అతడిని వెంటనే కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించినట్లు జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ తెలిపారు. శ్వాససంబంధిత ఇబ్బందులు ఏర్పడటం అనేది కరోనా లక్షణం. అయితే ఓం ప్రకాష్ మృతిని జైలు అధికారులు కరోనా మృతిగా చెప్పట్లేదు.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓం ప్రకాష్.. 2008లో ఓ లారీ చోరీ చేసిన కేసులో అరెస్టై.. అనంతపురం జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు. అదే సమయంలో జైలులో మొద్దు శీను తలపై బండరాయితో మోది చంపాడు. ఈ కేసులో ఆయనకి జీవిత ఖైదుపడింది. విశాఖ జైలులో చికిత్స అనుభవిస్తున్న ఓం ప్రకాష్ ఆదివారం మృతి చెందారు.