కేటీఆర్’కు భారీగా అంబులెన్సుల చెక్కులు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలే తన 45వ పుట్టినరోజుని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 6 అంబులెన్సులని ప్రభుత్వ ఆసుపత్రులకి అందజేస్తామని ప్రకటించారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ని స్పూర్తిగా తీసుకొని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు అంబులెన్సుల విరాళం చేస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి తన వంతుగా ఆరు అంబులెన్సులని సమకూరుస్తున్నారు. దీనికి సంబంధించిన చెక్కులని ఆయన మంత్రి కేటీఆర్ కు అందజేశారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అంబులెన్స్ ల కోసం రూ. 20లక్షల చెక్కును కేటీఆర్ కు అందించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2 అంబులెన్స్ ని అందిస్తున్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 2, ఎమ్మెల్సీలు నవీన్ 2, రాజు శాంబిపూర్ ఒక అంబులెన్స్ అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన చెక్ లని మంత్రి కేటీఆర్ కు అందజేశారు.