దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయ్. అయితే నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో 47,703 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14,83,156 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 4,96,988 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 9,52,743 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఈ మహమ్మారితో కొత్తగా 654 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో మృతుల సంఖ్య 47,703కి చేరింది.