సుశాంత్ మరణాన్ని వాడుకుంటున్నారు

బాలీవుడ్ లో బంధుప్రీతి వలనే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని హీరోయిన్ కంగనా రనౌత్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లని బయటపెట్టింది. వీరి వలననే సుశాంత్ మానసికంగా కృంగిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. పలువురు కంగనా ఆరోపణలని సమర్థించారు. బాలీవుడ్ లో బంధుప్రీతి ఉందని చెప్పారు. అయితే కంగనాని తప్పుపట్టే వర్గం ఉంది.

తాజాగా నటుడు సోనూసూద్ కంగనాపై ఫైర్ అయ్యారు. సుశాంత్ మరణాన్ని కంగానా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని కామెంట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ మాట్లాడుతూ.. సుశాంత్ ను ఏరోజూ కలవని వారు కూడా అతని గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారని విమర్శించాడు. సుశాంత్ మరణం గురించి మాట్లాడుతున్న వారంతా పబ్లిసిటీ కోసమే అలా చేస్తున్నారని విమర్శించారు.