రాజకుమారుడికి 21యేళ్లు, మగధీరుడుకి 11యేళ్లు !

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇవాళ పండగ చేసుకుంటున్నారు. మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. మహేష్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా నటించారు. ఈ సినిమా రిలీజై నేటితో 21యేళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా రాజకుమారుడు పోస్టర్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు మహేష్ అభిమానులు. #21YearsForRajakumarudu యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందుకున్న తొలి బ్లాక్ బస్టర్ చిత్రం ‘మగధీర’. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ కి జంటగా కాజల్ నటించింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన మగధీర టాలీవుడ్ రికార్డులని బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై నేటితో 11యేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో #11YearsForIHMagadheera యాష్ ట్యాగ్ ని చరణ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మొత్తానికి.. ఈరోజు సోషల్ మీడియాలో రాజకుమారుడు, మగధీరల హవా కొనసాగుతోంది.