సినీ పరిశ్రమలో మరో విషాదం

2020లో అన్నీ దారుణాలే జరుగుతున్నాయ్. ఓ వైపు కరోనా విజృంభిస్తోంది. వేల మందిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరాఠీ నటుడు అశుతోష్ భక్రే (32) ఆత్మహత్య చేసుకున్నారు.

నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ భక్రే తీవ్ర మానసిక ఆందోళనకు గురై, ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అతడు విగత జీవిగా కనిపించాడు. కొన్ని రోజులుగా భక్రే తీవ్ర మానసిక ఒత్తిడికి అతడు గురౌతున్నాడని బంధువులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భక్రే ‘భకార్, ఇచర్ థార్లా’ లాంటి మరాఠీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.