అమృతగా సాయి పల్లవి !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అమృత-ప్రణయ్ ప్రేమకథ, ప్రణయ్ హత్యని అమృత తండ్రి మారుతిరావు యాంగిల్ లో వర్మ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మర్డర్ ట్రైలర్ ని చూస్తే అదే అనిపిస్తోంది.

అమృత-ప్రణయ్ ప్రేమకథపై మరో సినిమా వస్తోంది. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. వెట్రిమార‌న్ క‌థ‌ల‌న్నీ.. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన‌వే. త‌ను కూడా.. ప్ర‌ణ‌య్ – అమృత‌ల క‌థ‌ని బాగా స్ట‌డీ చేశాడ‌ట‌. దాని ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడ‌ని స‌మాచారమ్. మారుతీరావు పాత్ర‌లో ప్ర‌కాష్‌రాజ్ న‌టించ‌బోతున్నాడు.

అమృత పాత్రలో సాయి పల్లవి నటించనున్నారు. వెట్రీమారన్ కథలన్నీ నిజాయిగా ఉంటాయి. కఠిన నిజాలని చూపిస్తారాయన. అమృత-ప్రణయ్ ప్రేమకథలోనూ వెట్రీమారన్ షాకింగ్ నిజాలు చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అమృత ప్రాత్రలో సాయి పల్లవి నటించబోతుండటం ఆకట్టుకుంటోంది.