హాస్పటల్ లో చేరిన సోనియా గాంధీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో చేరారు. అలాగని సోనియా గాంధీకి ఆరోగ్యం సీరియస్ గా ఏమీ లేదట. సాధారణ పరీక్షల నిమిత్తం చేరినట్టు ఆస్పత్రి వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని  డాక్టర్‌ డీఎస్‌ రానా వెల్లడించారు.

గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకొని తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే 2019 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తప్పని పరిస్థితుల్లో సోనియా గాంధీ మరోసార్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.