శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య(89) ఈ ఉదయం మృతి చెందారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని శ్మశాన వాటికలో శేషయ్య అంతక్రియలు నిర్వహించనున్నట్లు శేఖర్‌ కమ్ముల కుటుంబసభ్యులు తెలిపారు.

శేఖర్‌ కమ్ముల తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి శేశయ్య హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి సినిమాని ప్రారంభించారు.