హాస్పటల్ నుంచి అమితాబ్ డిశ్చార్జ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో బిగ్ బీని డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంటికి చేరుకున్నారు. బిగ్ బీ కోలుకున్నారనే విషయాన్ని తొలిత అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకొన్నానని అమితాబ్ ట్విట్ చేశారు.

ఈ సందర్భంగా అమితాబ్ అభిమానులకి కృతజ్ఝతలు తెలిపారు. తన కోసం ప్రార్థించిన స్నేహితులు, సన్నిహితులు, అభిమానులకి ధన్యవాదాలు అని ట్విట్ చేశారు. ఇక డాక్టర్ల సూచన మేరకు మరికొన్నాళ్లు హోం ఐసోలేషన్ లో ఉండబోతున్నట్టు తెలిపారు. నానావతి ఆసుపత్రి వైద్య బృందానికి ఈ సందర్భంగా అమితాబ్ కృతజ్ఝతలు తెలిపారు.

జులై 11న అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అదే రోజు అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కూడా నానావతి ఆసుపత్రిలోనే చేరారు. ఆ మరుసటి రోజు ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే వారిలో స్వల్పంగా లక్షణాలు ఉండటంతో హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఇటీవలే ఐశ్వర్య, ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు బిగ్ బీ కూడా సేవ్ అయ్యారు. ఇక మిగిలింది అభిషేక్ మాత్రమే.