అమిత్ షాకు కరోనా పాజిటివ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమిత్ షా ట్విట్ చేశారు. ‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను పరీక్ష చేయించుకున్నా. రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నా. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లమని, పరీక్షలు చేయించుకోమని అభ్యర్థిస్తున్నా’నని అమిత్ షా ట్విట్ చేశారు.

ఢిల్లీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో అమిత్ షా క్షేత్ర స్థాయిలో తిరిగారు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. అమిత్ షాకి కరోనా పాజిటివ్ అని తెలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. పలువురు ప్రముఖులు ట్విట్ చేస్తున్నారు. ఢిల్లీ సీఎం క్రేజీవాల్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు అమిత్ షా త్వరగా కోరుకోవాలని ట్విట్ చేశారు.