కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణలో కరోనాకి మరో ప్రజా ప్రతినిధి బలయ్యాడు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్న రాజయ్య (59) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఏ పార్టీ హవా కనిపించినా.. భద్రాచలంలో మాత్రం సున్నం రాజయ్యకు ఎదురే ఉండేది కాదు. ఆయనకి ప్రజల మనిషిగా మంచి పేరు ఉంది. రాజయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.