ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాదాపు వంద మంది కరోనాతో మృతి చెందుతున్నారు. అయితే గత 24గంటల్లో ఏపీలో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గాయ్. 7,665 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 80 మంది కరోనాతో మృతి చెందారు.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. మృతుల సంఖ్య 2,116కి చేరింది. ఒక్క రోజులో 6,924 మంది కోలుకోగా.. మొత్తంగా 1,45,636 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 యాక్టివ్‌ కేసులున్నాయి.