బోల్డ్ వెబ్ సిరీస్ లో అమలాపాల్

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ బంద్ అయ్యాయ్. దీంతో ప్రేక్షకులు ఓటీటీకి బాగా అలవాటు పడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచిని గమనించిన దర్శక-నిర్మాతలు కూడా ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నటించేందుకు స్టార్ హీరో-హీరోయిన్స్ ఆసక్తి చూపుతున్నారు.

సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ చేయగా… నిత్య మేనన్‌, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు అమలాపాల్‌ కూడా అదే పని చేస్తోంది.  1970ల నాటి కథతో తెలుగు- తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా అమలా పాల్‌ కనిపించనుంది.