డాక్టర్ మృతిపై ఈటెల సంతాపం

కరోనా వారియర్స్ కు కరోనా బారినపడుతుండటం. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేశ్‌ మృతి చెందారు. నరేష్ మృతిపట్ల తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు.

నరేష్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఈటెల హామీ ఇచ్చారు. నరేశ్‌ భార్యకు సముచిత స్థానంగల ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో తమ ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారని కొనియాడారు. వారి సేవలు వెలకట్టలేనివన్నారు. కొవిడ్‌పై చేస్తున్న ఈ యుద్ధంలో వైద్య సిబ్బంది ధైర్యంగా ముందుకెళ్లాలనీ.. వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ అండదండలు ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు.