కరోనా నుంచి కోలుకున్న సీఎం

కరోనా బారినపడిన కర్నాటక సీఎం యడియూరప్ప కోలుకున్నారు. ఈ నెల 2న యడియూరప్పకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆయన బెంగళూరులోని మణిపాల్ హాస్పటల్ లో చేరారు. అయితే తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. వారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,78,087కి పెరిగింది. మరణాల సంఖ్య 3,198కి చేరింది.