దేశంలో 45వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న కొత్తగా 53,601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులసంఖ్య 22,68,675కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 15లక్షల 83వేల మంది కోలుకోగా మరో 6లక్షల 39వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో మరో 871 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 45,257కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిసంఖ్య కూడా పెరగడం ఊరటనిచ్చే విషయం. నిన్న ఒక్కరోజే మరో 47వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70శాతానికి చేరింది. మరణాల రేటు 1.99శాతంగా కొనసాగుతోంది.