ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం సీరియస్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారమ్. ఆయనకి బుధవారం కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు. కరోనా చికిత్స కోసం చేసిన టెస్టుల్లో ప్రణబ్ మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స కూడా చేశారు.

ప్రసుత్తం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.