ప్రణబ్‌ ముఖర్జీకి బ్రెయిన్‌ సర్జరీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తనకు కొవిడ్‌ సోకిన విషయాన్ని సోమవారం మధ్యాహ్నం స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు ప్రణబ్. ఈ వారం రోజుల్లో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

కరోనా చికిత్స కోసం ప్రణబ్ ముఖర్జీ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన బ్రెయిన్‌కు శస్త్రచికిత్స చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్‌ ముఖర్జీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ ఇంత సడెన్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది ? అనేది తెలియాల్సి ఉంది. కరోనా సోకిన సమయంలోనే బ్రెయిన్ సర్జరీ చేయడంతో.. ప్రణబ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.