ప్రశాంత్ నీల్’తో ప్రభాస్ సినిమా.. ఫిక్స్ !

ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు సమాచారమ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కూడా కేజీఎఫ్ నిర్మాతలకి మరో సినిమా చేయాల్సి ఉంది ప్రశాంత్ నీల్. ఈ ప్రాజెక్ట్ లో హీరోగా ప్రభాస్ ని తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ఈ సినిమా మీదకు డిసెంబర్ లేదా జనవరి నుంచి వెళ్తాడు అని తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు ? అనేది అతి త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారమ్.  ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ ని వదిలారు. యూరప్ నేపథ్యంలో పునర్జన్మల కథతో ఈ ప్రేమకథ తెరకెక్కుస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత బహుబలి-కేజీఎఫ్ కాంబోలో సినిమా ఉండనుందని సమాచారమ్.