కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. రెండు వారాల క్వారంటైన్‌ పూర్తవ్వడంతో మరోసారి టెస్టు చేయించుకున్నారు. అందులో అందరికీ నెగిటివ్‌ వచ్చింది.

ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ప్లాస్మా దానం చేయడానికి మరో మూడు వారాల పాటు వెయి చేయాలని వైద్యులు చెప్పిన జక్కన్న తెలిపారు. ఆ లోగా శరీరంలో అవసరమైన యాంటీ బాడీస్‌ వృద్ధి చెందాయని డాక్టర్లు చెప్పినట్టు జక్కన్న తెలిపారు.