టాలీవుడ్ యువ దర్శకుడుకి కరోనా

టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. కరోనా బారినపడిన దర్శకుడు రాజమౌళి కోలుకున్నారు. బుధవారం చేసిన టెస్టుల్లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకి నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జక్కన్న ట్విట్ చేశారు. రాజమౌళి కోలుకున్నారనే ఆనందంలో ఉండగనే టాలీవుడ్ లో యువ దర్శకుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందనే న్యూస్ వచ్చింది.

ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అజయ్ భూపతి ట్విట్ చేశారు ”వచ్చేసింది” అని ట్విట్ చేసిన అజయ్ భూపతి. ఈ కరోనా నుండి కోలుకొని ”త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా” అని తెలిపారు. ఇక తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టారు ఈ యువ దర్శకుడు. రెండో సినిమా కోసం ‘మహా సముద్రం’ అనే కథని రెడీ చేసుకున్నాడు. ఈ కథతో చాలా మంది హీరోల చుట్టూ తిరిగారు. ఫైనల్ గా శర్వానంద్ ఓకే చేశారు. అయితే ఇది మల్టీస్టారర్.. మరో హీరో కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.