ఏపీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు

ఏపీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవాళ కాస్త తగ్గి 8,943 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరాయి.

గత 24 గంటల్లోనే మరో 9,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 97మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.