స్టయిలీష్ కపుల్స్

మెగా డాటర్ నిహారిక బిజినెస్‌మెన్ జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్యని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ త‌దిత‌ర కుటుంబ స‌భ్యులు కూడా హాజ‌ర‌య్యారుడు. అయితే ఈ వేడుకలో అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

బన్నీ-స్నేహా రెడ్డి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టలీశ్ కపుల్స్ ని కామెంట్స్ చేస్తున్నారు. స్టయిలీష్ స్టిల్స్ ఇవ్వడంలో స్నేహారెడ్ది బన్నీని మించిపోయింది. ఈ ఫోటోలని చూసిన వారు.. బన్నీ భార్యకి జంటగా ఓ సినిమా తీయొచ్చుకదా అంటున్నారు. ఇద్దరిది ఫర్ ఫెక్ట్ జోడీ, స్టయిలీష్ కపుల్స్ అని కామెంట్స్ తో కొడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది అల.. వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ.. తన తదుపరి సినిమాగా పుష్ప సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుంది.