ప్రగతి భవన్’లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్


తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్ ‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమరవీరుల సైనిక స్మారకం వద్ద నివాళులర్పించారు.

స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ప్రతియేడాది తెలంగాణ ప్రభుత్వం నుంచి బహుమతి అందేది. ఉద్యోగులకి లేదా రైతులకి సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పేవారు. అయితే ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎవరికి ఎలాంటి బహుమతులు అందలేదు.